జగన్పై నవతరం పార్టీ అధ్యక్షుడు విమర్శలు
PLD: ఓపెన్ కాని డిజిటల్ బుక్ను ఓపెన్ చేయడం జగన్ గొప్పతనం అంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. శుక్రవారం చిలకలూరిపేటలో మాట్లాడుతూ.. రౌడీయిజం వల్లే రెడ్ బుక్ వచ్చిందని మర్చిపోయి, ఈ ఫార్స్ బుక్ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ డిజిటల్ బుక్ పేలని దీపావళి టపాసుల మాదిరిగా మిగిలిపోతుందన్నారు.