'మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి'
GDWL: భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు శనివారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్లు, అనంతరం విపత్తుల నిర్వహణ కార్యాలయ అధికారులకు ఆయన వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మరణించిన వారి కుటుంబలను అదుకోవలన్నారు.