నర్సిపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సిపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కోనసీమ: ఆలమూరు మండలం నర్సిపూడి పీఏసీఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు రాయుడు వెంకటస్వామి  ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులు తమకు పంటకు మద్దతు ధర పొందచ్చన్నారు.