'శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
ASF: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. రెబ్బెన మండలం రాంపూర్లో జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన జల మహోత్సవానికి ఆమె హాజరయ్యారు. గతంలో నెలకొని ఉన్న తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా మొదటిసారి గ్రామంలో ప్రతి ఇంటికి శుద్ధ జలాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.