VIDEO: 'అక్రమాలు చేశారు కాబట్టి విలీనం చేశారు'
సిరిసిల్ల సెస్లో అక్రమాలు చేశారు కాబట్టే NPDCLలో విలీనం చేశారని కాంగ్రెస్ సిరిసిల్ల టౌన్ ఉపాధ్యక్షుడు అన్నల్దాస్ భాను అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. NPDCLలో విలీనమైన నాలుగు రోజుల్లోనే 200 కలెక్షన్లు మంజూరు చేసిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలోనే సెస్లో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపించారు.