రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై
KNR: ప్రజలు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. రోడ్డు దాటే ముందు తప్పనిసరిగా ఎడమ, కుడి చూసి వాహనాల వేగాన్ని అంచనా వేసి మాత్రమే ముందుకు వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తుతూ రోడ్డు దాటకూడదని, పాఠశాలలు, కూడళ్ల వద్ద పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వెల్లడించారు.