రాములబండ సీతారాముల రథాన్ని లాగిన మంత్రి
NLG: నల్గొండ మండలం రాములబండలో జరుగుచున్న శ్రీ సీతా రామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.