ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
NZB: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా EVM గోడౌన్ సీల్ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. EVM గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.