స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్

విశాఖలోని స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆనంద్ స్పా సెంటర్‌పై ఫోర్త్‌ టౌన్ పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. టీఎస్‌ఎన్ కాలనీలోని ఆర్‌కే ప్లాజాలో ఉన్న ఆనంద్ స్పాలో ఇతర రాష్ట్రాల మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో స్పా యజమాని సచిన్‌తో పాటు ముగ్గురు విటులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.