కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు

కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు

PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజుపల్లిలో శనివారం ఉదయం 7:00 గంటలకు కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు బ్రష్ చేసుకుంటున్న అంబటి రాజ్ కుమార్‌పై కోతుల మంద అకస్మాత్తుగా మూకుమ్మడి దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్ కుమార్ భుజానికి, చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి.