బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
TPT: బైక్ను లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై నిన్న రాత్రి చోటుచేసుకుంది. కలువాయికి చెందిన రమేశ్ మల్లాంలో వివాహ వేడుకకు వెళ్తుండగా మార్గమధ్యలో మనుబోలు జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొనడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.