యువకుడు అదృశ్యం.. కేసు నమోదు
KDP: మైదుకూరు చెందిన మారుతి కుమారుడు మహిధర్ (25) అదృశ్యమైనట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల కిందట పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఎంతకు రాకపోవడం, బంధువులు దగ్గర లేకపోవడంతో తండ్రి మారుతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మంగారిమఠంలో సంచారం చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.