నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రెండోవిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై ఈ సెషన్లో చర్చించనున్నారు. ఈ క్రమంలో తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశారు. అలాగే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడనున్నారు.