VIDEO: వినాయక ప్రతిష్ట విగ్రహం ఊరేగింపు
AKP: నాతవరం బీసీ కాలనీలో శ్రీ బాల వరసిద్ధి వినాయక ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ ప్రతిష్ఠ విగ్రహాన్ని గ్రామంలో శోభాయాత్రగా ఊరేగించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ వాస్తు హోమం నిర్వహించారు. రేపు ఉదయం 8.38 గంటలకు ఆలయ ప్రారంభం, ప్రతిష్ఠ మహోత్సవం జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.