విద్యార్థులకు ప్రభుత్వం GOOD NEWS
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఆర్థికశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 2,813 కళాశాలలకు సంబంధించిన మొత్తం రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా సమీక్షలో నిర్ధారించారు.