25 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ

25 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ

AP: ఈ నెల 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చేనెల 15 నుంచి నాలుగు విడతల్లో స్మార్డ్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డులను ఉచితంగా ఇంటింటికి వెళ్లి అందిస్తామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70 లక్షల కార్డుదారులకి కూడా కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు.