10వ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

10వ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ADB: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, ఇందుకోసం 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.