కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిక
NLG: మిర్యాలగూడ పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మంద పద్మ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ MLA విజయసింహారెడ్డి ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.