మాచాని సోమప్పకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
KRNL: ఎమ్మిగనూరులోని మాచాని సోమప్ప సర్కిల్ వద్ద ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సోమప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పద్మశ్రీ మాచాని సోమప్ప 48వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు, అభిమానులు పాల్గొన్నారు.