ఆయుష్మాన్ వయో వందన కార్డుల సమస్యలపై వినతి
E.G: ఆయుష్మాన్ వయో వందన కార్డులకు వైద్య సదుపాయాలు అందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ రామకృష్ణం రాజు, కో కన్వీనర్ యానాపు ఏసు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం సమర్పించారు. ఆయుష్మాన్ వయో వందన కార్డులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు.