దేవాలయం నిర్మాణం కోసం ఎమ్మెల్యే విరాళం
KRNL: దేవనకొండ మండలం కరివేములలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ దేవాలయానికి ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ రూ.20వేల విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే సేవాభావాన్ని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.