రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథాతథం

కోనసీమ: అమలాపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, డివిజన్లలో కక్షిదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.