ఈనెల 16 నుంచి సీపీఎం నిరవధిక నిరహార దీక్షలు
BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలని సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి జరిగే నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. రామన్నపేట రహదారి బంగ్లాలో నిరాహార దీక్షల కరపత్రాన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.