సీనియర్ న్యాయవాది కన్నుమూత
విజయనగరం బార్ అసోసియేషన్ సభ్యుడు, ప్రముఖ సీనియర్ న్యాయవాది కోలగట్ల తమన్న శెట్టి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విజయనగరంలోని ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి స్వయాన సోదరుడైన తమన్న శెట్టి మృతి పట్ల న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, సన్నిహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.