సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద తాజా పరిస్థితి

MLG: కన్నాయి గూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద బుధవారం గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో 7,78,600 క్యూసెక్కులు చేరిందని అధికారులు తెలిపారు. బ్యారేజీలోని 59 గేట్లను తెరిచి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు ఉండగా, 82 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతుందన్నారు.