రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి: గుడిపాటి సైదులు

SRPT: రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఆకాంక్షించారు.