వైభవంగా కుంకుమార్చన.. నెలకొన్న ఆధ్యాత్మికత

వైభవంగా కుంకుమార్చన.. నెలకొన్న ఆధ్యాత్మికత

RR: జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతిదేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్దఎత్తున పాల్గొని కుంకుమార్చన చేశారు. ప్రజలు కార్యక్రమానికి తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది.