'పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి'

TPT: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంగళవారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జిల్లా అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.