రైతులకు చేదువార్త.. యాసంగి సాగుకు నిలిచిన మూసీ నీరు
NLG: యాసంగి సీజన్ ముగియడంతో మూసీ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి విడుదలను అధికారికంగా నిలిపివేశారు. గత డిసెంబర్ నుంచి సుమారు 100 రోజుల పాటు నిరంతరాయంగా సాగునీటిని అందించడంతో పంటలు చేతికి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం కావడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి సరఫరాను పూర్తిగా బంద్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.