నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్
సత్యసాయి: ఏసీబీ అధికారిగా నటిస్తూ తహసీల్దార్ను బెదిరించి రూ. 50 లక్షలు వసూలు చేసిన నిందితుడు హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కలగల్లు గ్రామానికి చెందిన ఇతడు 2021లో ముదిగుబ్బ తహసీల్దార్ను ఫోన్ ద్వారా బెదిరించి భారీగా నగదు వసూలు చేశాడు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ముదిగుబ్బ సీఐ శివరాముడు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు.