ఆదోని జిల్లా డిమాండ్కు బుట్టా రేణుక మద్దతు
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని వైసీపీ సర్కిల్లో ఆదోని జిల్లా ఏర్పాటు కోసం విద్యార్థి, యువజన, వామపక్ష ప్రజా సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైసీపీ కర్నూలు జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా డిమాండ్ ప్రజల గుండెచప్పుడుగా మారిందని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని ఆమె అన్నారు.