చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే
ATP: కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తెస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురంలో జరిగిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. చేనేత భరోసా కింద రూ.25 వేలు అందిస్తామని ప్రకటించారు. మగ్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ప్రభుత్వం నేతన్నలకు భరోసా కల్పిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కార్మికులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.