2 రోజులు నర్సంపేట మార్కెట్‌కి సెలవులు

2 రోజులు నర్సంపేట మార్కెట్‌కి సెలవులు

WGL: నర్సంపేట నేడు (మంగళవారం), రేపు (బుధవారం) వ్యవసాయ మార్కెట్‌కి సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ తెలిపారు. నేడు పట్టణం మొత్తానికి బంద్‌ ఉండడం, రేపు కార్తీక మాస పర్వదినం కావడంతో రెండు రోజులపాటు మార్కెట్‌ మూసివేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం రైతు సోదరులు గమనించగలరని కోరారు.