రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

VZM: విజయనగరంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గం వరకు కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.