ఇజ్రాయెల్ దాడులు.. 13 మంది మృతి
దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. డమాస్కస్ శివార్లలోని బీట్ జిన్ అనే గ్రామంలోకి ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించాయి. దీంతో వారిని అడ్డుకోబోయిన గ్రామస్తులపై కాల్పులు జరిపాయి. ఈ దాటిలో 13 మంది పౌరులు మరణించినట్లు సిరియా వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపింది. అయితే, ఈ వార్తలను ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా ఖండించింది.