జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు @11AM
MHBD: జిల్లాలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 60.24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రక్రియను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.