ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి, గో సంరక్షణకు భారీ విరాళం
NTR: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు నిత్య ఉచిత ప్రసాద పథకం, గో సంరక్షణ పథకం కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన శ్రీ కోటిరావు, అంజు కుమారి కుటుంబ సభ్యులు విరాళం అందజేశారు. నిత్య ఉచిత ప్రసాద పథకం కోసం రూ. 2,25,000లు, గో సంరక్షణ పథకం కోసం రూ. 2,25,000లను అంజు కుమారి, తనీషి రావు పేరుతో ఆలయ ఈఓ శీనా నాయక్కు అందజేశారు. అధికారులు దాతలను అభినందించారు.