విద్యార్థులను అభినందించిన ప్రొఫెసర్
VZM: JNTU-GV ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరో గర్వకారణమైన విజయాన్ని సాధించారు. నవంబర్ 14వ తేదీన జయరాజ్ స్టీల్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో 10 మంది విద్యార్థిని, విద్యార్థులు మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ వి. వెంకట సుబ్బారావు విద్యార్థులను అభినందించారు.