అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
VSP: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు ఇవాళ పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అంతరాలయంలో చీర, సారె, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో రాజ్ గోపాల్ రెడ్డి ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో కోరికలు నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు.