ఇళ్ల స్కీమ్లో రూ.80 కోట్ల అవకతవకలు: మంత్రి
AP: గత YCP హయాంలో ఇళ్ల స్కీమ్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మంత్రి పార్థసారథి ఆరోపించారు. కాంట్రాక్ట్ తీసుకున్న రాక్రీట్ నిర్మాణ సంస్థ స్కీమ్కు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాప్తాడు YCP మాజీ MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మోసం జరిగిందని తెలిపారు. రూ.80 కోట్లకు అవకతవకలు చేశారని విజిలెన్స్ విచారణలో తేలిందని వెల్లడించారు.