పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్
GNTR: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు. గుండ్లపాడు తెదేపా నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనలో వారిపై కేసు నమోదైంది. రెండు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు.