ఎస్ఐఆర్‌కు ప్రజల సహకారం కీలకం: కమిషనర్

ఎస్ఐఆర్‌కు ప్రజల సహకారం కీలకం: కమిషనర్

కర్నూలు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐ‌ఆర్)కు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని, ప్రజల పాత్రే కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. ఆదివారం ఆయన ఏ.క్యాంపు మోంటెస్సోరి స్కూల్, కలెక్టరేట్ వెనుక ఇందిరా గాంధీ స్మారక మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన ఎస్‌ఐ‌ఆర్ స్పెషల్ క్యాంపెయిన్‌ను పరిశీలించారు.