ఎక్సైజ్ 'సురక్ష యాప్'` బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇవాళ ఎక్సైజ్ అధికారులతో కలిసి ఏపీ ఎక్సైజ్ 'సురక్ష యాప్' బ్రోచర్ను ఆవిష్కరించారు. 'నాణ్యమైన మద్యమే వినియోగదారుడికి చేరాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరికొత్త యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఎక్సైజ్ శాఖలో పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తుంది' అని ఎమ్మెల్యే తెలిపారు.