'రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే లక్ష్యం'
NZB: జిల్లాలో రాబోయే వానకాలం సీజన్కు సంబంధించి రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.