'ఉచిత క్యాన్సర్ పరీక్షలను వినియోగించుకోవాలి'
SKLM: మహిళలు ఉచిత క్యాన్సర్, స్క్రీనింగ్ పరీక్షలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ అన్నారు. “స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకం ప్రవేశపెట్టారని, ఆరోగ్యవంతమైన జీవనానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.