వెలుగు వృద్ధాశ్రమం, చిల్డ్రన్ హోమ్‌ల తనిఖీ

వెలుగు వృద్ధాశ్రమం, చిల్డ్రన్ హోమ్‌ల తనిఖీ

విజయనగరంలోని ATK వెలుగు వృద్ధాశ్రమం, పెద్దతాడివాడిలోని మెర్సీ మిషన్ చిల్డ్రన్ హోమ్‌ను మంగళవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వృద్ధులు, బాలలతో మాట్లాడి వారి బాగోగులు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అని విచారించారు.