రూ.39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం

రూ.39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం ముగిసింది. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే, అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.