మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు

SKLM: ఇంటర్మీడియట్ అడ్వన్స్ పరీక్షలకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. పరీక్షలకు సంబంధించి శుక్రవారం జూం కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 56 పరీక్ష కేంద్రాల్లో వొకేషనల్, జనరల్ గ్రూపుల నుంచి 21,571 మంది హాజరు కానున్నారు.