నేడు పరీక్షా కేంద్రాల వద్ద BNS163 అమలు

నేడు పరీక్షా కేంద్రాల వద్ద BNS163 అమలు

NZB: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం పరీక్షను ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని ఆయన సూచించారు.