చిట్యాల మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ సన్మాన సభ

చిట్యాల మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ సన్మాన సభ

NLG: చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కమిషనర్‌గా దండు శ్రీను అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం చిట్యాలలో ఆయన పదవి విరమణ సన్మాన సభకు హాజరై మాట్లాడారు. ఆయన శేష జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.